2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని ఆ పార్టీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కాపులను కూటమిఆసరాతో తమ వైపు తిప్పుకున్న టీడీపీకి అదే అస్త్రంతో తిప్పి కొట్టాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కాపులకు జగన్ స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది. దాంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కాపు నేతలు ఇప్పుడు కీలకం అయ్యారు. నిన్న వైసీపీ కాపు నేతలంతా ఒక చోట సమావేశమై తీర్మానం చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.








































