అమరావతి: ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్‌ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, అవసరమైన వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లో 59 శాతం మంది, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెరుగైన ఫలితాలు పొందిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *